సరిహద్దుల్లో పాక్ కాల్పులు..భారత జవాన్ మృతి

ABN , First Publish Date - 2020-10-01T15:17:16+05:30 IST

జమ్మూకశ్మీరులోని సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాను మృతి చెందారు....

సరిహద్దుల్లో పాక్ కాల్పులు..భారత జవాన్ మృతి

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాను మృతి చెందారు. జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టారులో  పాకిస్థాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత సైనిక విభాగానికి చెందిన లాన్స్ నాయక్ కర్నాల్ సింగ్ అమరుడయ్యారు. పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. పాక్ కాల్పుల్లో అమరుడైన లాన్స్ నాయక్ కర్నాల్ సింగ్ కు భారత సైనికులు నివాళులు అర్పించారు. పాక్ కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారని రక్షణ శాఖ పౌరసంబంధాలశాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు. 

Updated Date - 2020-10-01T15:17:16+05:30 IST