కరోనా రాకుండా ఇళ్ల ముందు దీపాలు

ABN , First Publish Date - 2020-03-30T10:59:44+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని కోరుతూ గిరిజన ప్రాంతాల్లోని మహిళలు ఇంటి ముందు దీపాలు

కరోనా రాకుండా ఇళ్ల ముందు దీపాలు

కురుపాం రూరల్‌, మార్చి 29 : కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని కోరుతూ గిరిజన ప్రాంతాల్లోని మహిళలు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తున్నారు. గత వారం రోజు లుగా మహిళలు సాయంత్రం కాగానే ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గులు వేసి వేప ఆకులతో కూడిన ధూపాన్ని వేస్తున్నారు. కురుపాం మండలంలోని పెదగొత్తితి, తదితర గిరిజన గ్రామాల్లో గిరిజనులు దీపాలు వెలిగించారు. వేపాకులతో ధూపం వేయడం వల్ల యాంటీబయాటిక్‌ ఉత్పత్తి అయి వైరస్‌ నశిస్తుందని మహిళలు నమ్ముతున్నారు.

Updated Date - 2020-03-30T10:59:44+05:30 IST