భార్యభర్తల మధ్య తరచూ గొడవలు.. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో.. మసస్తాపానికి గురై..

ABN , First Publish Date - 2020-08-10T13:11:09+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన..

భార్యభర్తల మధ్య తరచూ గొడవలు.. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో.. మసస్తాపానికి గురై..

తాడికొండ(గుంటూరు): కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లాం గ్రామ శివారు తాతిరెడ్డిపాలెంకు చెందిన ఇమ్మడి శ్రీనివాసరావు(35)కు మావుళ్లపల్లి గ్రామానికి చెందిన అనూషకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాసరావు ఉల్లిపాయల వ్యాపాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు వ్యాపారంలో తీవ్ర నష్టం రావటంతో శ్రీనివాసరావు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు రావటంతో అనూష పుట్టింటికి వెళ్ళింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాసరావు తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తెలిపారు. 


Updated Date - 2020-08-10T13:11:09+05:30 IST