గుండె, మూత్రపిండాల సమస్యతో ఎయిమ్స్కు లాలూ
ABN , First Publish Date - 2022-03-22T22:47:50+05:30 IST
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గుండె, మూత్రపిండాల సమస్యలను..
రాంచీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గుండె, మూత్రపిండాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆయనను ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించనున్నట్టు ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఒకరు మంగళవారం తెలిపారు. పశుగ్రాసం కుంభకోణంలో జైలుశిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స తీసుకుంటున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితిపై రిమ్స్ మెడికల్ బోర్డు తాజాగా సమీక్ష జరిపిందని, గుండె, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్టు నిర్ధారించిందని రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్కు పంపనున్నామని చెప్పారు. తేదీ విషయమై జైలు అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ ప్రసాద్ వివరించారు.