9న లాలు విడుదల.. ఆపై నితీశ్కు వీడ్కోలే: తేజస్వి
ABN , First Publish Date - 2020-10-24T08:40:43+05:30 IST
రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత, తన తండ్రి లాలు ప్రసాద్ వచ్చే నెల 9న బెయిల్పై జైలు నుంచి విడుదలవుతున్నారని...
హిసువా(బిహార్), అక్టోబరు 23 : రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత, తన తండ్రి లాలు ప్రసాద్ వచ్చే నెల 9న బెయిల్పై జైలు నుంచి విడుదలవుతున్నారని.. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు వీడ్కోలు తథ్యమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ విజయం ఖాయమని ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ధీమా వ్యక్తం చేశారు.