ఆర్ఎస్ఎస్ దేశ సంప్రదాయాలను నాశనం చేస్తోంది: లాల్ దేశాయ్

ABN , First Publish Date - 2021-10-05T19:46:17+05:30 IST

గుంటూరు: ఆర్ఎస్ఎస్ నేతలు భారతదేశ సంప్రదయాలు, సంస్కృతిని నాశనం చేస్తున్నారని...

ఆర్ఎస్ఎస్ దేశ సంప్రదాయాలను నాశనం చేస్తోంది: లాల్ దేశాయ్

గుంటూరు: ఆర్ఎస్ఎస్ నేతలు భారతదేశ సంప్రదయాలు, సంస్కృతిని నాశనం చేస్తున్నారని అఖిల భారత సేవాదళ్ చైర్మన్ లాల్ దేశాయ్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన ఎలా ఉండేదో ఆర్ఎస్ఎస్ నేతల పాలనా కూడా ఇప్పుడు అలానే ఉందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం కలసి దేశాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు దందా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. సేవాదళ్ రాష్ట్ర సమ్మేళనంలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నామని చెప్పారు. గత 10నెలలుగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాటం చేస్తుంటే వారిపైన బీజేపీ ప్రభుత్వం దాడి చేయించి.. రైతుల హత్యలకు కారణమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నరేంద్ర మోదీ కిసాన్ విరోధి అని, ఆయనను నమ్మే పరిస్థితిలో రైతులు లేరని లాల్ దేశాయ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-05T19:46:17+05:30 IST