తిరుమలేశునికి సేవ నా పూర్వజన్మ సుకృతం: లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2021-09-16T00:15:12+05:30 IST

తిరుమలేశునికి సేవ నా పూర్వజన్మ సుకృతం: లక్ష్మీనారాయణ

తిరుమలేశునికి సేవ నా పూర్వజన్మ సుకృతం: లక్ష్మీనారాయణ

హైదరాబాద్: తిరుమల వేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని టీటీడీ పాలకమండలి సభ్యులు లక్ష్మీనారాయణ అన్నారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త లక్ష్మీనారాయణ ఎన్నికైయ్యారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులతో తనను ఈ అదృష్టం వరించిందని ఆయన అన్నారు. గోవిందునికి సేవ చేసే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు టీటీడీ పాలకమండలి సభ్యులు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా టీటీడీకి సలహాలు, సూచనలిస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు.



Updated Date - 2021-09-16T00:15:12+05:30 IST