భక్తిశ్రద్ధలతో లక్ష తులసి దళార్చన

ABN , First Publish Date - 2021-11-28T05:27:27+05:30 IST

పట్టణంలోని కొత్తపే టలో వెలసిన శ్రీలక్ష్మీ వెంక టేశ్వరస్వామి ఆలయంలో లక్ష తులసి అర్చన పూజ కార్యక్ర మాన్ని భక్తుల నడుమ ఘనం గా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో లక్ష తులసి దళార్చన

ధర్మవరంరూరల్‌, నవం బరు27: పట్టణంలోని కొత్తపే టలో వెలసిన శ్రీలక్ష్మీ వెంక టేశ్వరస్వామి ఆలయంలో లక్ష తులసి అర్చన పూజ కార్యక్ర మాన్ని భక్తుల నడుమ ఘనం గా నిర్వహించారు. కార్తీకమా స నాలుగవ శనివారంను పురస్కరించుకుని దేవాల య ప్రాంగణంలో  అర్చకులు సు దర్శన్‌ అచార్యులు, సునీల్‌ కుమార్‌ కమిటీ ఆధ్వర్యంలో తొలుత స్వామివార్లను శ్రీవెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల సమేత ఉత్సవ విగ్రహల ను వివిధ రకాల పూలమాలలతో అలంకరించి, లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని వేద మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ గోవిందనామస్మరణతో అత్యంత వైభవంగా జరు పుకున్నారు. విశ్వసేన రాధనపుణ్యాహవచనంతో పూజకార్యక్రమాలను ప్రారంభించారు.  అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ కుళ్లాయప్ప, దత్తశివ, సంజీవులు, రామాంజినేయులు, బిల్లేనాగప్ప తదితరులు పా ల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:27:27+05:30 IST