ఆగమోక్తంగా లక్ష బిల్వార్చన
ABN , First Publish Date - 2021-11-28T06:24:44+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం ఆగమోక్తంగా లక్ష బిల్వార్చన, కుంకుమార్చన సేవలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి, నవంబరు 27: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం ఆగమోక్తంగా లక్ష బిల్వార్చన, కుంకుమార్చన సేవలు నిర్వహించారు. నాలుగో కాలాభిషేకం అనంతరం ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు పలురకాల అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ లక్ష బిల్వార్చన, కుంకుమార్చన సేవలు నిర్వహించారు. తరలి వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం ముక్కంటి ఆలయ ఆలయ ఊంజల్సేవా మండప సమీపంలో కార్తీక దీపానికి అర్చకులు పూజలు నిర్వహించారు. ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఆకాశదీపాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్ సూపరింటెండెంట్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.