శ్రీశైలంలో లక్ష దీపోత్సవం
ABN , First Publish Date - 2020-11-24T06:03:48+05:30 IST
శ్రీశైలంలో కార్తీకమాసం సోమవారం పురస్కరించుకుని పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతులు నిర్వహించారు.
శ్రీశైలం, నవ ంబరు 23: శ్రీశైలంలో కార్తీకమాసం సోమవారం పురస్కరించుకుని పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతులు నిర్వహించారు. పుష్కరిణి ప్రాంగణమంతా దీపాలను ఏర్పాటు చేశారు. విశాఖ శారదా పీఠం స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధన చేశారు. ఈవో కేఎస్ రామరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు.