Lakhimpur కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిలు వచ్చినా విడుదలకు నో

ABN , First Publish Date - 2022-02-11T16:49:22+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటన కేసులో కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసినా...

Lakhimpur కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిలు వచ్చినా విడుదలకు నో

అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటన కేసులో కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసినా, అతను జైలు నుంచి విడుదల కాలేదు.లఖింపూర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో ఆశిష్ మిశ్రాపై ఐపీసీ 147, 148, 149, 302,307,326,34,427. 120 బి కింద కేసు నమోదై ఉన్నాయి. ఆశిష్ పై ఆయుధాల చట్టం సెక్షన్ కింద అభియోగం మోపారు.హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్‌లో సెక్షన్‌లు 302, 120 బి ప్రస్తావన లేదు. సెక్షన్ 302 హత్యకు సంబంధించినది అయితే, సెక్షన్ 120 బి నేరపూరిత కుట్రతో వ్యవహరిస్తుంది.బెయిల్ ఆర్డర్ నుంచి ఈ రెండు సెక్షన్లు తొలగించినందున, ఆశిష్ మిశ్రాను విడుదల చేయలేమని జైలు అధికారులు చెప్పారు.


దీంతో బెయిల్ ఆర్డర్‌లో మిగిలిన రెండు సెక్షన్లను జోడించాలని ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించనున్నారు.గత సంవత్సరం అక్టోబరు 3న జరిగిన ఈ సంఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆశిష్‌ను గత సంవత్సరం అక్టోబరు 9న అరెస్టు చేశారు. 


Updated Date - 2022-02-11T16:49:22+05:30 IST