ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ Varun Gandhi సంచలన లేఖ
ABN , First Publish Date - 2021-11-20T18:30:22+05:30 IST
లఖింపూర్ కెహ్రీ హింసాత్మక ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు...
లఖింపూర్ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ :లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు.దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వరుణ్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శనివారం సంచలన లేఖ రాశారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ లేఖ రాశారు.ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి పేరు వినిపించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వరుణ్ గాంధీ కోరారు.
రైతుల సమస్యలపై ప్రధాని మోదీకి రాసిన లేఖను వరుణ్ గాంధీ శనివారం ట్విట్టర్లో పంచుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులపై రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కేసులను రద్దు చేయాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.