ఏపీ రైతులపై 1.6 లక్షల కోట్ల రుణం
ABN , First Publish Date - 2021-07-27T08:50:09+05:30 IST
దేశ రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి బ్యాంకులకు రైతులు రూ.16.8 లక్షల కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉందని
న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): దేశ రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి బ్యాంకులకు రైతులు రూ.16.8 లక్షల కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, రైతు రుణమాఫీ చేసే ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని తేల్చిచెప్పింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఎస్.జ్యోతిమణి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరడ్ సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నాబార్డు సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి 31వరకు ఏపీలో 1.2కోట్ల బ్యాంకు ఖాతాలకు సంబంధించి రైతులు రూ.1.69కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇక తెలంగాణలో 63.22లక్షల ఖాతాలకు గాను రైతులు రూ.84వేల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని మంత్రి వివరించారు.