Guntur : ప్రభను నిర్మించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు
ABN , First Publish Date - 2022-03-03T12:23:12+05:30 IST
చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన
గుంటూరు జిల్లా /చిలకలూరిపేట : చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతులు కోటయ్యస్వామికి మొక్కు చెల్లించేందుకు ప్రభను నిర్మించారు. స్వయంగా ప్రభను కొండకు తరలించి బుధవారం తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామం నుంచి కోటప్పకొండకు ప్రభను నిర్మించారు. నిర్వహణ భారంతో ఆ తర్వాత నుంచి ప్రభను నిర్మించడంలేదు. ప్రస్తుతం వర్క్ఫ్రమ్ హోం చేస్తున్న సాఫ్ట్వేర్ యువతులు రూ.3 లక్షలతో ప్రభను నిర్మించారు. ఈ సందర్భంగా యువతులను గ్రామస్థులు ప్రశంసించారు.