ప్రవర్తన బాలేదని చంపేశారు!
ABN , First Publish Date - 2021-03-04T06:55:48+05:30 IST
కొత్త వెలంపేటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపునకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మహిళ భర్త, తల్లి ఈ హత్య చేసినట్లు గుర్తించారు.
తల్లి, భర్తే హంతకులు
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
తుని రూరల్, మార్చి 3: కొత్త వెలంపేటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపునకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మహిళ భర్త, తల్లి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. రూరల్ పోలీస్స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీని వాసరావు వివరాలు వెల్లడించారు. చిం తపల్లి సత్యనారాయణ, ఆదిలక్ష్మి తుని పట ణంలో నివాసముంటున్నారు. ఆదిలక్ష్మి వివాహేతర సంబంధాలు కలిగి ఉం డడంతో ఆమె తల్లి కొవ్వాడ సత్తమ్మ, భర్త సత్యనారాయణ చాలా సార్లు మందలించారు. అయినప్పటికీ ఆదిలక్ష్మి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో గత నెల 28న భర్త సత్యనారాయణ సుత్తితో ఆది లక్ష్మి తలపై మోది హతమార్చాడు. దీనికి ఆదిలక్ష్మి తల్లి సత్తమ్మ సహకరించింది. మృతదేహాన్ని సంచిలో మూట కట్టి తుని రూరల్ ప్రాంతమైన కొత్త వెలంపేట శివారు మామిడి తోటలోకి ద్విచక్ర వాహ నంపై తరలించారు. అక్కడ నిప్పంటించి పరారయ్యారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రహదారులపై సీసీ కెమెరాల్లో వారి కదలికలు గుర్తించారు. దీంతో అదు పులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడిందని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసిన సీఐ కిషోర్బాబు, ఎస్ఐ గణేష్ కుమార్, రూరల్ పోలీసులను డీఎస్పీ అభినందించారు.