కాటేసిన రా‘బంధువు’లు
ABN , First Publish Date - 2022-01-12T16:22:36+05:30 IST
విల్లుపురం సమీపంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన బంధువులు ఎనిమిదిమందిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. విల్లుపురం ఈచ్చాంకుప్పానికి చెందిన బాలిక
- బాలికపై బంధువుల సామూహిక అత్యాచారం
- పోక్సో చట్టం కింద 8 మంది అరెస్టు
చెన్నై: విల్లుపురం సమీపంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన బంధువులు ఎనిమిదిమందిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. విల్లుపురం ఈచ్చాంకుప్పానికి చెందిన బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో పుదుచ్చేరిలోని శిశు సంరక్షణ కేంద్రంలో ఉంటూ ఆమె ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. కొద్ది నెలలకు ముందు ఆ బాలిక ఈచ్చాంకుప్పంలోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది. కాగా రెండు రోజుల క్రితం బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఆమెను ముండియంబాక్కం ఆస్పత్రికి తీసుకెళ్ళారు. బాలికకు వైద్యులు స్కానింగ్ చేయగా నాలుగు నెలల గర్భిణి అని తెలుసుకుని దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక పెద్దమ్మ మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపినప్పుడు బాలిక బంధువులైన వెంకటేశన్ (81), ఇళయ రాజా (28), మోహన్ ఆమెపై తరచూ అత్యా చారానికి పాల్పడినట్లు వెల్లడైంది. వీరిలో మోహన్ ఆ బాలికకు అన్న వరుస అవుతాడని పోలీసులు తెలిపారు. వీరితోపాటు వెంకటేశన్ (25), ప్రభు (37), బాబు (22), సత్యరాజ్ (28)తో కలిసి వీరందరూ బాలికపై అత్యాచారం జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడుగురిని పోక్సోచట్టం కింద అరెస్టు చేశారు. ఈ అత్యాచారం కేసుతో సంబంధం ఉన్న ఏళుమలై నెల్లూరులో ఉండగా పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు.