నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి.. మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-29T05:42:31+05:30 IST

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది.

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి.. మహిళ మృతి

పాకాల, నవంబరు 28: నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది. పాకాల మండలంలోని వల్లివేడు దళితవాడకు చెందిన ఎర్రమ్మ (56) శుక్రవారం పశువులు మేపడానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం ఆవులు ఇంటికి వచ్చేసినా ఎర్రమ్మ రాలేదు. దీంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆమెకోసం గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం వైసీపీ నాయకుడు వల్లివేడు రాజారెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, వీఆర్వో హరికృష్ణలు పోలీసులకు సమాచారం అందించి స్థానిక యువకులతో కలిసి గాలించారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని వరదరాజస్వామి చెరువులో మహిళ మృతదేహాన్ని గుర్తించి, వెలికితీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ రాజశేఖర్‌లు మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి శవ పరీక్ష నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-29T05:42:31+05:30 IST