మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-08T22:23:03+05:30 IST
చిత్తూరు: మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పెనుమూరు మండలం కార్తికేయపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ సుకన్య (29) తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తోంది.
చిత్తూరు: మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పెనుమూరు మండలం కార్తికేయపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ సుకన్య (29) తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తమ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.