మహిళ గర్భాశయం నుంచి నాలుగు కిలోల కణితి తొలగింపు
ABN , First Publish Date - 2021-04-12T06:53:40+05:30 IST
మోతీనగర్లోని సన్రిడ్జ్ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.
కృష్ణానగర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మోతీనగర్లోని సన్రిడ్జ్ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు పరీక్షలు చేయగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఉన్నట్లు గుర్తించి ఆదివారం శస్త్రచికిత్స చేసి నాలుగు కిలోల బరువున్న కణితి తొలగించారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. డాక్టర్లు ఎం. స్మిత, డి. సురే్షబాబు ఆధ్వర్యలో శస్త్రచికిత్స జరిగింది.