మహిళల కిడ్నాప్: 20 సవర్ల నగల దోపిడీ
ABN , First Publish Date - 2021-07-25T14:23:45+05:30 IST
ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేసి వారి వద్ద 20 సవర్ల బంగారు నగల్ని దోపిడీ చేసిన ఉదంతం తెలిసింది. రాణిపేట జిల్లా షోలింగర్కు చెందిన సుజాత, ఆమె బంధువు చెన్నై విల్లి వాక్కంకు చెందిన శివ
వేలూరు(చెన్నై): ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేసి వారి వద్ద 20 సవర్ల బంగారు నగల్ని దోపిడీ చేసిన ఉదంతం తెలిసింది. రాణిపేట జిల్లా షోలింగర్కు చెందిన సుజాత, ఆమె బంధువు చెన్నై విల్లి వాక్కంకు చెందిన శివభు వనమ్మాల్లు శుక్రవారం రాణి పేట జిల్లా గుడియాత్తంకు వెళ్లేందుకు షోలింగర్ బస్టాండ్లో బస్సు కోసం వేచివున్నారు. ఆ సమయంలో అటుగా కారులో వచ్చిన వ్యక్తులు, వీరి వద్దకు వచ్చి ఎక్కడకు వెళుతున్నారు అని అడిగి, మేమూ గుడియాత్తం వెళుతున్నామని, రూ.100 ఇస్తే చాలని తెలిపారు. వారి మాటలు నమ్మిన ఇద్దరు కారు ఎక్కారు. కారు గుడియాత్తం మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళుతుండడాన్ని గమనించిన ఇద్దరు దీనిపై వారిని ప్రశ్నించారు. దీంతో, ఒక్కసారిగా బెదిరించి, వారి వద్ద ఉన్న 20 సవర్ల బంగారం లాక్కొని, రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో నుంచి వారిని తోసివేసి పరారయ్యారు. ఈ వ్యవహారంపై బాధిత మహిళలు సత్తువాచేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.