మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాఽధించాలి
ABN , First Publish Date - 2021-01-16T05:08:49+05:30 IST
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మార్గదర్శకులు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి
కారంచేడు(పర్చూరు), జనవరి 15 : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మార్గదర్శకులు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. కారంచేడు చినవంతెన సెంటర్ లో ఏర్పాటు చేసిన మహిళా వెయిట్ లిఫ్టింగ్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రా రంభించారు. కారంచేడు స్పోర్ట్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. అనంతరం వెయిట్ లిఫ్ట్ పోటీల్లో ప్రతిభ చాటిన వారికి బహుమతులను పురందేశ్వరి అందజేశారు.