కొవిడ్‌ నిబంధనలు పాటించలేదంటూ ఆందోళన

ABN , First Publish Date - 2021-05-06T05:24:10+05:30 IST

కుప్పం పురపాలక సంఘం పరిధిలోని షాహీ గార్మెంట్స్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించనందుకు నిరసనగా అందులో పనిచేసే మహిళా కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించలేదంటూ ఆందోళన
గార్మెంట్స్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళా కార్మికులు

కుప్పం, మే 5: కుప్పం పురపాలక సంఘం పరిధిలోని షాహీ గార్మెంట్స్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించనందుకు నిరసనగా అందులో పనిచేసే మహిళా కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. చేసే పనులకు స్వస్తి చెప్పి కంపెనీ ఎదుట చేరి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమకు కనీసమైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 15 రోజులపాటు కంపెనీని మూతవేసి తమకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని డిమాండు చేశారు.

Updated Date - 2021-05-06T05:24:10+05:30 IST