కరోనా టెస్టు.. యువతికి తెలీకుండానే ఆమెపై అత్యాచారం!

ABN , First Publish Date - 2020-07-30T21:46:49+05:30 IST

కరోనా టెస్టుల పేరిట ఓ ల్యాబ్ టెక్నీషియన్ యువతిని కాటేశాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధుడు వికృతానందాన్ని పొందాడు. చేసిన దారుణానికి ఫలితంగా పోలీసులు అతడిపై అత్యాచారం కింత కేసు నమోదు చేశారు.

కరోనా టెస్టు.. యువతికి తెలీకుండానే ఆమెపై అత్యాచారం!

అమరావతి: కరోనా టెస్టుల పేరిట ఓ ల్యాబ్ టెక్నీషియన్ యువతిని కాటేశాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధుడు వికృతానందాన్ని పొందాడు. చేసిన దారుణానికి ఫలితంగా పోలీసులు అతడిపై అత్యాచారం కింత కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఈ దారుణం జరిగింది. బాధితురాలు ఇటీవల కరోనా టెస్లు కోసం నిందితుడి వద్దకు వెళ్లింది. తన సహోద్యాగికి కరోనా రావడంతో తనూ కరోనా పరీక్ష చేయించుకునేందుకు ఆమె నిర్ణయించింది. అయితే..ఫలితాలు కచ్చితంగా రావాలంటే మాత్రం జనాంగం నుంచి కూడా శాంపిల్ సేకరించాలని మహిళను నమ్మించాడు. నిజమేనేమో అనుకున్న యువతి అందుకు అంగీకరించింది. దీంతో ఆమె మర్మాంగం నుంచి శాంపిల్‌ను సేకరించి పైశాచికానందం పొందాడు. ఆ తరువాత ఆమె ఈ విషయాన్ని యాదాలపంగా తన సోదరుడికి తెలిపింది. దీంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. డాక్టర్ల వద్ద ఈ విషయం ప్రస్తావిస్తే.. కరోనా శాంపిళ్లను జనాంగం నుంచి సేకరించరని వారు స్పష్టం చేశారు. దీంతో ఆమె మోసపోయిందని, ల్యాబ్‌లో దారుణం జరిగిందని అతడికి అర్థమైంది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ నీచుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-30T21:46:49+05:30 IST