ఆర్థిక సమస్యలతో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-07T06:20:08+05:30 IST

ఆర్థిక సమస్యలతో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన భీమిలి కాలేజీ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగింది.

ఆర్థిక సమస్యలతో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆత్మహత్య
సాయి శంకర్‌ (ఫైల్‌ఫొటో)

భీమునిపట్నం, జూలై 6: ఆర్థిక సమస్యలతో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన భీమిలి కాలేజీ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ పి.రాంబాబు తెలిపిన వివరాల మేరకు... అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడవాడ గ్రామానికి చెందిన చదువుల సాయి శంకర్‌ (30)కు ఏడాదిన్నర కిందట తగరపువలస సంతపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. దంపతులు  ఇద్దరూ భీమిలి కాలేజి రోడ్డులో నివాసముంటూ, సంగివలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్‌టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. కాగా శంకర్‌ భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్లింది. కొద్దినెలలుగా అతడు ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడు. వీరికి ఐదు నెలల బాబున్నాడు. మంగళవారం రాత్రి తాను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ లభించింది. తన చావుకు తానే కారణమని, ఆర్థిక సమస్యలతోనే చనిపోతున్నట్టు అందులో పేర్కొన్నాడని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-07T06:20:08+05:30 IST