రుణాలు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2022-01-18T06:18:26+05:30 IST

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో డాక్యుమెంటేషన్‌ పూర్తై పెండింగ్‌లో ఉన్న లబ్ధ్దిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు.

రుణాలు మంజూరు చేయాలి
కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న కేవీపీఎస్‌ సభ్యులు

కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఎస్సీల నిరసన

తాడేపల్లి టౌన్‌, జనవరి 17: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో డాక్యుమెంటేషన్‌ పూర్తై పెండింగ్‌లో ఉన్న లబ్ధ్దిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. సోమవారం లబ్ధిదారులతో కలిసి తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీని ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.  లబ్ధిదారులకు వెంటనే రుణాలు ఇవ్వాలని డిసెంబరు 2న హైకోర్టు ఆదేశించింనా అధికారులు అమలు చేయకుండా దళితులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కోర్డు ఉత్తర్వులు అమలు చేస్తాం 

కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని, లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఎండీ హర్షవర్థన్‌  హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ తూర్పు, గుంటూరు జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్‌, నాయకులు నటరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-18T06:18:26+05:30 IST