హత్య కేసులో ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి
ABN , First Publish Date - 2022-05-24T05:43:11+05:30 IST
కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణం బర్తరఫ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు డిమాండ్ చేశారు.
భీమవరం అర్బన్, మే 23: కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణం బర్తరఫ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు డిమాండ్ చేశారు. సుబ్రహ్మఽణ్యం హత్యను నిరసిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్రాంతిబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ కుల దురహంకారంతో దళిత యువకుడి ని దారుణంగా హత్య చేశారన్నారు. ప్రభుత్వంలో పెద్దల అండ లేకుండా ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చెయ్యడానికి సాహసిం చడన్నారు. అనంతబాబుని కాపాడడానికి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నారనడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. గతంలో దళిత యువకుడిని శిరోముండనం చేసిన త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు ఇంకో దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇస్తారేమోనని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులే దళితులపై హత్యలు, దాడులు చేయడం దారుణమన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఎం.వైకుంఠరావు, శేషపు ఆశ్రీయ్య, రపాక రాజీవ్, డి.ఆశోక్, తదితరులు పాల్గొన్నారు.