విక్రయించేదెలా?
ABN , First Publish Date - 2020-03-29T11:11:34+05:30 IST
పంట కోతకు వచ్చినా విక్రయించుకోలేక కేవీబీపురం మండలానికి చెందిన పుచ్చకాయ, దోస సాగుచేస్తున్న రైతులు అవస్థలు పడుతున్నారు.
కేవీబీపురం, మార్చి 28: పంట కోతకు వచ్చినా విక్రయించుకోలేక కేవీబీపురం మండలానికి చెందిన పుచ్చకాయ, దోస సాగుచేస్తున్న రైతులు అవస్థలు పడుతున్నారు. మండల పరిధిలో 175 ఎకరాల్లో సుప్రీత్ రకం పుచ్చకాయ, కర్ణాటక రకం దోస పంటలు సాగవుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి కోతలు మొదలయ్యాయి.
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వ్యాపారులు ముందుకు వచ్చినా రవాణాకు వాహనాల్లేక రూ.లక్షల్లో నష్టపోవాల్సి వచ్చిందని మండల రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం తోటల్లోనే కాయలు ఉండి పోవడంతో రవాణాకు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.