కువైట్‌లో క‌రోనా క‌ల్లోలం..!

ABN , First Publish Date - 2020-08-02T16:55:38+05:30 IST

కువైట్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తోంది. శ‌నివారం కూడా దేశ‌వ్యాప్తంగా 491 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

కువైట్‌లో క‌రోనా క‌ల్లోలం..!

కువైట్ సిటీ: కువైట్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తోంది. శ‌నివారం కూడా దేశ‌వ్యాప్తంగా 491 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. 593 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా సోకిన వారి సంఖ్య 67,448 చేరితే... మొత్తం రిక‌వ‌రీలు 58,525 అయ్యాయి. ఇక నిన్న సంభ‌వించిన ఆరు కొత్త మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌రకు దేశ‌వ్యాప్తంగా 453 మ‌ది ఈ వైర‌స్‌కు బ‌ల‌య్యారు. ప్ర‌స్తుతం దేశంలో 8,470 యాక్టివ్ కేసులు ఉండ‌గా... 134 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే... వ‌ర‌ల్డ్‌వైడ్‌గా స్వైర విహారం చేస్తున్న కోవిడ్ ఇప్ప‌టికే 6.88 ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. కోటి 80 ల‌క్ష‌ల మందికి ప్ర‌బ‌లింది. 

Updated Date - 2020-08-02T16:55:38+05:30 IST