కువైట్‌లో విజృంభిస్తున్న మమమ్మారి..!

ABN , First Publish Date - 2020-06-07T02:37:20+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కువైట్‌లోనూ ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో

కువైట్‌లో విజృంభిస్తున్న మమమ్మారి..!

కువైట్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కువైట్‌లోనూ ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కువైట్‌లో 487 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 10 మంది కరోనా వైరస్ కారణంగా మరణించినట్లు పేర్కొన్నారు. శనివారం ఒక్కరోజే 1005 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కువైట్‌లో 3లక్షలకుపైగా కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటి వరకు కువైట్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 31వేలకు చేరింది. మహమ్మారికి సుమారు 254 మంది ప్రాణాలు కోల్పోయారు. 19వేల మందికిపైగా కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 


Updated Date - 2020-06-07T02:37:20+05:30 IST