వ్యాక్సిన్ తీసుకుంటే కువైత్‌లోకి అనుమతి

ABN , First Publish Date - 2021-06-18T11:20:23+05:30 IST

గుర్తింపు పొందిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న ప్రవాస భారతీయులను తమ దేశంలోకి తిరిగి రావడానికి అనుమతిస్తామని కువైత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలంగా విదేశీయుల రాక

వ్యాక్సిన్ తీసుకుంటే కువైత్‌లోకి అనుమతి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గుర్తింపు పొందిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న ప్రవాస భారతీయులను తమ దేశంలోకి తిరిగి రావడానికి అనుమతిస్తామని కువైత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలంగా విదేశీయుల రాకను కువైత్ నిషేధించింది. దీంతో సెలవుపై మాతృభూమికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైత్‌ రాలేక భారీ సంఖ్యలో స్వదేశంలోనే ఇరుక్కుపోయారు. ఇలా ఒక్క రాయలసీమ నుంచే వేలాది మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండు డోసుల టీకా తీసుకున్న విదేశీయులను ఆగస్టు ఒకటి నుంచి తిరిగి  దేశంలోకి అనుమతించాలని కువైత్ మంత్రివర్గం నిర్ణయించింది. గర్తింపు పొందిన వ్యాక్సిన్ తీసుకొని, 72 గంటల ముందు చేసిన పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారిని దేశంలోకి అనుమతిస్తామని కువైత్ ప్రకటించింది. వచ్చిన వారు వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి, మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.


Updated Date - 2021-06-18T11:20:23+05:30 IST