ఆర్జేడీ నాయకత్వం మారితే మహాఘట్ బంధన్ తో పొత్తుకు సిద్ధం : ఉపేంద్ర కుష్వాహా

ABN , First Publish Date - 2020-09-25T22:51:04+05:30 IST

ఆర్జేడీ నాయకత్వంలో మార్పులు సంభవిస్తే మహా ఘట్ బంధన్‌తో పొత్తు పెట్టుకోడానికి సిద్ధమేనని కేంద్ర మాజీ మంత్రి,

ఆర్జేడీ నాయకత్వం మారితే మహాఘట్ బంధన్ తో పొత్తుకు సిద్ధం : ఉపేంద్ర కుష్వాహా

పాట్నా : ఆర్జేడీ నాయకత్వంలో మార్పులు సంభవిస్తే మహా ఘట్ బంధన్‌తో పొత్తు పెట్టుకోడానికి సిద్ధమేనని కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌ఎల్‌ఎస్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. ‘‘ఆర్జేడీ నాయకత్వంలో మార్పులు సంభవిస్తే మహా ఘట్ బంధన్‌తో పొత్తుకు సిద్ధం. సీఎం నితీశ్‌తో పోరాడే శక్తి తేజస్వీ యాదవ్‌కు లేదు’’ అని కుష్వాహా విమర్శించారు. అయితే పొత్తుల విషయమై ఆ పార్టీ కుష్వాహా పైనే భారం మోపింది.


అయితే ఈ విషయంలో మాత్రం తమ మొదటి ప్రాధాన్యం మహాఘట్ బంధన్‌తోనే  అని ఆ పార్టీ ప్రతినిధి మాధవ్ ఆనంద్ తెలిపారు. మహాఘట్ బంధన్‌లో తీవ్రమైన గందరగోళం ఉందని, ఆయా పార్టీల మధ్య అసలు సమన్వయమే లేదని విమర్శించారు. శనివారం తమ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, ఇందులోనే పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటామని మాధవ్ తెలిపారు. 

Updated Date - 2020-09-25T22:51:04+05:30 IST