దంపతుల పంచాయితీలో తలదూర్చిన సమీప బంధువు.. కోపంతో భర్త..

ABN , First Publish Date - 2020-08-11T18:38:57+05:30 IST

దంపతుల పంచాయితీలో తలదూర్చిన సమీప బంధువుపై..

దంపతుల పంచాయితీలో తలదూర్చిన సమీప బంధువు.. కోపంతో భర్త..

బంధువుపై కొడవలితో దాడి

తీవ్ర రక్తగాయాలు.. ఆస్పత్రికి తరలింపు..


అనంతపురం(ఆంధ్రజ్యోతి): దంపతుల పంచాయితీలో తలదూర్చిన సమీప బంధువుపై భర్త దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట గ్రామంలో బీసీ కాలనీకి చెందిన రాఘవేంద్రరెడ్డి కొన్నేళ్ల కిందట గార్లదిన్నె మండలం ముకుందాపురానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కమార్తె. రాఘవేంద్రరెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. కొంతకాలంగా కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో వారికి సమీప బంధువు, నగర శివారులోని సెవెన్‌ హిల్స్‌ కాలనీకి చెందిన లక్ష్మీకాంతరెడ్డి, మరికొందరు కలిసి ఈనెల 8వ తే దీన వారి ఇంటికెళ్లారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ చేసి, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పంచాయితీ తనకు అనుకాలంగా లేదని లక్ష్మీకాంతరెడ్డిపై రాఘవేంద్రరెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో లక్ష్మీకాంతరెడ్డి ద్విచక్రవాహనంలో సోమవారం సాయం త్రం పంపునూరు వెళ్లి వస్తున్నాడు.


అతడు కురుగుంట సమీపంలోకి రాగానే.. పథకం ప్రకారం రాఘవేంద్రరెడ్డి తన తండ్రి, కూతురి సహకారంతో ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. అతడిని రోడ్డు పక్కకు తీసుకెళ్లి, కొడవలితో దాడి చేసి, పరారయ్యారు. తీవ్ర రక్తగాయాలతో ఉన్న లక్ష్మీకాంతరెడ్డిని అటుగా వెళ్తున్న స్థానికులు చూసి, పోలీసుల సమాచారం అందించారు. అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల నిమిత్తం బెంగుళూరుకు తసుకెళ్లారు. ఈ మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-11T18:38:57+05:30 IST