Kurnool: తుంగభద్ర జలాశయానికి భారీగా వరద
ABN , First Publish Date - 2022-05-23T14:14:06+05:30 IST
కర్ణాటకలో ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది.
కర్నూలు: కర్ణాటకలో ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1607.78 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టీఏంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 31.184 టీఎంసీలుగా కొనసాగుతోంది. జలాశయం ఇన్ఫ్లో 38890 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 359 క్యూ సెక్కులుగా నమోదు అయ్యింది.