AP: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-02T13:13:29+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 45,006 క్యూసెక్కులు,

AP: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 45,006 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా... ఇప్పటి వరకు 874.10  అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 159.3828 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-02T13:13:29+05:30 IST