నేటి నుంచి శ్రీశైలంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2022-03-05T13:27:33+05:30 IST
శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి దేవస్థానంలో నేటి నుంచి ఆర్జిత సేవలు పున:ప్రారంభంకానున్నాయి.
కర్నూలు: శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి దేవస్థానంలో నేటి నుంచి ఆర్జిత సేవలు పున:ప్రారంభంకానున్నాయి. అలాగే భక్తులకు స్వామి స్పర్శదర్శనాన్ని కల్పించనున్నారు. దేవాలయంలో గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నేటి నుంచి యధావిధిగా జరుగనున్నాయి. కరెంట్, ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లను భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి రోజుకు మూడుసార్లు స్వామివారికి సామూహిక అభిషేకాలను అర్చకులు నిర్వహించనున్నారు.