స్కై మార్షల్ ఆర్ట్స్లో జిల్లాకు పతకాలు
ABN , First Publish Date - 2021-04-13T05:31:44+05:30 IST
నెల్లూరులో 11న జరిగిన రాష్ట్ర స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 16 పతకాలు సాధించారని జిల్లా స్కై మార్షల్ ఆర్ట్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబీ సాహెబ్ సోమవారం తెలిపారు.
కర్నూలు(స్పోర్ట్స్), ఏప్రిల్ 12: నెల్లూరులో 11న జరిగిన రాష్ట్ర స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 16 పతకాలు సాధించారని జిల్లా స్కై మార్షల్ ఆర్ట్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబీ సాహెబ్ సోమవారం తెలిపారు. సీనియర్ పురుషుల విభాగంలో అబ్దుల్లా, అజీజ్, చాంద్బాషా, ఖాజా బాషా మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. జూనియర్స్ విభాగంలో రోహిత్, సయ్యద్, నరేష్, రామాంజినేయులు మొదటి స్థానంలో నిలిచారు. షేక్ అబ్దుల్లా, ఘని ఖాన్, సోహెబ్, రహిమాన్ రజత పతకాలను సాధించి రెండో స్థానంలో నిలిచారు. అండర్-14 విభాగంలో లక్ష్మీకాంత్, యశ్వంత్ బంగారు పతకాలు సాధించగా, సూర్యచరణ్ రజత పతకం సాధించినట్లు నబీ సాహెబ్ తెలిపారు. సోమవారం స్థానిక కోల్స్ కళాశాల మైదానంలో జరిగిన అభినందన కార్యక్రమంలో జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు శుకుర్ మియా పాల్గొని, గెలుపొందిన క్రీడాకారులకు పతకాలను బహూకరించి అభినందించారు.