Rayalaseema Varsityలో విద్యార్థి సంఘాల దీక్ష భగ్నం
ABN , First Publish Date - 2022-06-03T16:46:26+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు చేపట్టిన 48 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ (Rayalaseema Varsity)లో విద్యార్థి సంఘాలు చేపట్టిన 48 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వీసీ ఆనందరావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు 48 గంటల సామూహిక దీక్షకు పిలుపిచ్చారు. కాగా... ధర్నా చౌక్లో విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.