పాతాళగంగ నీటిలో తేలాడుతున్న మృతదేహం
ABN , First Publish Date - 2021-09-29T17:26:11+05:30 IST
శ్రీశైలం డ్యామ్ పాతాళగంగలోని నీటిలో మృతదేహాల తేలాడుతుండటం కలకలం రేపుతోంది.
కర్నూలు: శ్రీశైలం డ్యామ్ పాతాళగంగలోని నీటిలో మృతదేహాల తేలాడుతుండటం కలకలం రేపుతోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మృతుడు మెదక్ జిల్లాకు చెందిన దోనిపుడి సాంబశివరావు(48)గా పోలీసులు గుర్తించారు. గత మూడు రోజుల కిందట లింగాలగట్టు పెద్ద బ్రిడ్జిపై నుంచి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రిందట శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గౌరిశంకర్ లాడ్జిలో రూంను మృతుడు సాంబశివరావు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన ఈగలపెంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.