ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు
ABN , First Publish Date - 2021-10-07T13:50:40+05:30 IST
జిల్లాలోని మంత్రాలయంలో గల పరిమళ పాఠశాల స్కూల్ ఆవరణలో ఆగి ఉన్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయంలో గల పరిమళ పాఠశాల స్కూల్ ఆవరణలో ఆగి ఉన్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.