కర్నూలులో విషాదం
ABN , First Publish Date - 2021-09-17T16:14:18+05:30 IST
జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
కర్నూలు: జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నొస్సం గ్రామ సమీపంలోని చిన్న చెరువులో తల్లి కొడుకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన చిన్నె౦ మాధవి(26), నాగ పూజిత్గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సంజమాల ఎస్సై తిమ్మారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.