Kurnool: రైలుపట్టాల పక్కనే ప్రేమజంట మృతదేహాలు
ABN , First Publish Date - 2022-06-29T17:48:30+05:30 IST
జిల్లాలోని కృష్ణగిరి మండలం మల్యాల సమీపంలో రైలు పట్టాల పక్కనే ప్రేమ జంట మృతదేహాలు పడి ఉన్నాయి.
కర్నూలు: జిల్లాలోని కృష్ణగిరి మండలం మల్యాల సమీపంలో రైలు పట్టాల పక్కనే ప్రేమ జంట మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులు ఆలంకొండకు చెందిన జంటగా గుర్తించారు. వీరు ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రేమజంటది హత్యా?... ఆత్మహత్యా?.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.