Kurnool: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-10T14:05:17+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది.
కర్నూలు: జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. 50 మంది వైద్య విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మందికి, నలుగురు హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాధితులంతా జీజీహెచ్ పెయింగ్ బ్లాక్లో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని ల్యాబ్కు పంపారు.