Kurnool ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్కు అంతరాయం..రోగుల అవస్థలు
ABN , First Publish Date - 2022-06-08T14:09:38+05:30 IST
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని జనరేటర్ కూడా మొరాయించింది. దీంతో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ, యురాలజీ, నెఫ్రాలజీ, వార్డుల్లో రోగులు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎక్స్ రే, సిటీ స్కాన్ పరీక్షలకూ అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు ఉక్కపోతతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు.