కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-08-10T23:03:49+05:30 IST

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు పెండింగ్ జీతాలు చెల్లించాలని పెట్రోల్ పోసుకుని..

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు పెండింగ్ జీతాలు చెల్లించాలని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను సూపరింటెండెంట్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు ఇచ్చే వరకూ అక్కడి నుంచి కదలమని పట్టుబట్టారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-08-10T23:03:49+05:30 IST