కన్న తల్లిని గెంటేసిన మున్సిపల్ చైర్మన్

ABN , First Publish Date - 2021-12-22T21:13:51+05:30 IST

ఎమ్మిగనూరులో దారుణం జరిగింది. తల్లిదండ్రులపై మున్సిపల్ ఛైర్మన్ రఘు దాడికి తెగబడ్డాడు.

కన్న తల్లిని గెంటేసిన మున్సిపల్ చైర్మన్

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో దారుణం జరిగింది. తల్లిదండ్రులపై మున్సిపల్ ఛైర్మన్ రఘు దాడికి తెగబడ్డాడు. తల్లిని ఇంటి నుంచి గెంటివేశాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులతో రఘు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే వారిపై దాడి చేశాడు. ఆస్తి కోసం రఘు తమను వేధిస్తున్నాడని తల్లి సరోజ ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటికొచ్చి తమపై దాడి చేస్తున్నాడని, కుమారుడితో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తమకు రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గత మూడు నెలలుగా ఆస్తి కోసం తన కొడుకు వేధిస్తున్నాడని ఆమె తెలిపారు.

Updated Date - 2021-12-22T21:13:51+05:30 IST