కర్నూల్‌ జిల్లా: డోన్‌లో బీభత్సము సృష్టించిన వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2021-12-14T15:43:56+05:30 IST

కర్నూలు జిల్లా: డోన్‌లో సోమవారం రాత్రి వైసీపీ నాయకులు బీభత్సం సృష్టించారు.

కర్నూల్‌ జిల్లా: డోన్‌లో బీభత్సము సృష్టించిన వైసీపీ నాయకులు

కర్నూలు జిల్లా: డోన్‌లో సోమవారం రాత్రి వైసీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా రహదారిపై వెళుతున్న  ఐచర్‌ వాహనం కారును ఢీ కొట్టడంతొ వాహనం ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న ఉంగరాని గుండ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడి కుమారుడు ఐచర్‌ వాహనం డ్రైవర్‌పై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనను ఐచర్‌ వాహన డ్రైవర్‌ వైసీపీ కౌన్సిలర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేవని పట్టణ సీఐ మల్లికార్జున తెలిపారు. 

Updated Date - 2021-12-14T15:43:56+05:30 IST