కర్నూలు జిల్లా: దాడులు చేసుకున్న వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు

ABN , First Publish Date - 2021-10-28T17:59:54+05:30 IST

ఆదోని మండలం, ఆరేకల్లులో వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు దాడులు చేసుకున్నాయి.

కర్నూలు జిల్లా: దాడులు చేసుకున్న వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు

కర్నూలు జిల్లా: ఆదోని మండలం, ఆరేకల్లులో వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో లక్ష్మన్న ఇంటి నిర్మాణం జరుగుతోంది. నిర్మాణం జరుగుతున్నప్పుడు రాళ్లు తిమ్మారెడ్డి ఇంటిదగ్గర పడ్డాయి. అంతే.. అది ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది. మాటా మాటా పెరిగింది... అది దాడుల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో ఆ గ్రామం ఉద్రిక్తతగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-28T17:59:54+05:30 IST