వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం: కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-20T20:38:06+05:30 IST

మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు చాలా నష్టపోయారని టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం: కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

కర్నూలు జిల్లా: మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు చాలా నష్టపోయారని, అన్ని రంగాల్లో ఇబ్బంది ఏర్పడిందని టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లా, కోడుమూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, శ్రీలంక పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తాగు సాగు నీరందిస్తామన్నారు. ఫ్లెక్సీలపై వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీలో మంత్రులు కేవలం ప్రొటోకాల్ కొరకే వున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీకే క్యాడర్ వుందని, వైసీపీకి క్యాడర్ లేదన్నారు. కేవలం రాజశేఖర్ రెడ్డి హవా ఉందని, ఆ హవాతోనే జగన్ గెలిచారన్నారు. ప్రజలు రాజశేఖర్ రెడ్డి పాలన వస్తుందనుకున్నారు..అక్కడే పాలన గాడి తప్పిందని సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.

Updated Date - 2022-04-20T20:38:06+05:30 IST