శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-07-25T15:56:45+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.
కర్నూలు జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో: 3,78,311 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో: 31,784 క్యూసెక్కులుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం: 860.30 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం: 106.9352 టీఎంసీలు ఉంది. దీంతో ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరగడంతో సంగమేశ్వర ఆలయం నీట మునుగుతోంది. క్రష్ణా జలాలు ఆలయం శిఖరాన్ని తాకాయి. ఆదివారం సాయంత్రానికి సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా నీట మునగనుంది.