కర్నూలు జిల్లా: కలుషిత నీరు తాగి నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-04-07T21:22:48+05:30 IST

కర్నూలు: జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందారు. మరో వందమందికిపైగా...

కర్నూలు జిల్లా: కలుషిత నీరు తాగి నలుగురి మృతి

కర్నూలు: జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందారు. మరో వందమందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలుషిత నీరు తాగి గ్రామస్తులు చనిపోతుండడంతో గోరుకల్లు వాసులు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. 


పాణ్యం మండలంలో గోరుకల్లులో మూడు రోజుల నుంచి కలుషిత నీరుతాగి 30 మందికిపైగా అస్వస్థతకులోనయ్యారు. వారిలో కిట్టు, హుస్సేన్, మద్దమ్మ చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు గురై అస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గోరుకల్లును నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనకుమారి, డీఎంహెచ్‌వోతోపాటు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సందర్శించారు. కొత్త డ్రైన్, పైపులైన్లు వేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగునీరు.. తాగునీటిలో కలిసి కలుషితమైందని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గౌరు చరితారెడ్డి అన్నారు.

Updated Date - 2021-04-07T21:22:48+05:30 IST